Friday, May 24, 2024

హైదరాబాద్‌కు రానున్న మాయావతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంగళవారం సాయంత్రం బిఎస్‌పి అధినేత్రి మాయావతి హైదరాబాద్‌కు రానున్నారు. ఇవాళ రాత్రి పార్క్ హయత్ హోటల్ లో మాయావతి బస చేయనున్నారు. తెలంగాణలో రెండు రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బుధవారం ఉదయం 11 గంటలకు సూర్యాపేట బహిరంగ సభలో మాయావతి పాల్గొంటారు. గురువారం పెద్దపల్లిలో జరగనున్న బహిరంగా సభలో ఆమె పాల్గొంటారు.

తెలంగాణ ఎన్నికలలో బిఎస్పీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో బిఎస్సీ భారీగా ఓట్లు చీల్చుతుందని రాజకీయ ప్రముఖులు అభిపాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News