Saturday, May 18, 2024

ఆర్చరీలో తెలంగాణకు రజతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ సీనియర్ ఆర్చరీ పోటీల్లో తెలంగాణ మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. రాష్ట్రానికి చెందిన మహిళా టీమ్ అసాధారణ ఆటతో అలరించింది. ఇదే క్రమంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర టీమ్‌కు ఈ విభాగంలో స్వర్ణం లభించింది. ఈ పోటీల్లో మానస, శ్రేష్ఠ రెడ్డి, తానిపర్థి చికిత, మన్సురా హబీబ్‌లు తెలంగాణకు ప్రాతినిథ్యం వహించారు. మరోవైపు అద్భుత ప్రతిభతో జాతీయ స్థాయిలో పోటీల్లో రజత పతకాన్ని సాధించిన తెలంగాణ మహిళా టీమ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. పలువురు క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వీరిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News