Wednesday, May 15, 2024

రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో గోదాం పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది.

భయాందోళనకు గురైన స్థానికుల సమాచారంతో హుటాహుటినా అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News