Wednesday, May 8, 2024

ఎల్‌బినగర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్‌బినగర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు సభ్యుల గల ముఠాను ఎస్‌ఒటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 30 గ్రాముల ఎండిఎంఎ, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. సదరు ముఠా సభ్యులు ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఎవరెవరికి అమ్ముతున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల చేతుల్లోకి ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News