Monday, August 25, 2025

దిమ్మదుర్తిలో దారుణం.. భార్య గొంతు కోసి…

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లాలోని మామడ మండలం దిమ్మదుర్తిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని నర్సయ్యగా గుర్తించారు. కూతురు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News