Friday, May 17, 2024

కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఇఒగా అశోక్ వాస్వాని

- Advertisement -
- Advertisement -

ముంబై : కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండి), సిఇఒగా ప్రముఖ బ్యాంకర్ అశోక్ వాస్వాని బాధ్యతలు స్వీకరించారు. 2023 సెప్టెంబర్ 1న ఫౌండర్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ వైదొలిగిన తర్వాత బ్యాంక్ తాత్కాలిక ఎండి, సిఇఒగా దీపక్ గుప్తా ఉన్నారు. ఇప్పుడు గుప్తా స్థానంలో అశోక్ బాధ్యతలు చేపట్టారు. జనవరి 1 నుంచి అశోక్ వాస్వాని బ్యాంక్ ఎండి, సిఇఒగా బాధ్యతలు చేపట్టారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించారు. మూడేళ్ల పాటు కోటక్ బ్యాంక్ సిఇఒగా వాస్వాని నియామకానికి 2023 అక్టోబర్‌లో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News