Monday, September 15, 2025

చెట్టును ఢీకొన్న బైక్‌: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలం నాంపల్లి-బంజార ఎల్లాపూర్ గ్రామాల మధ్య శనివారం ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. వీరిద్దరు హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన పోతుగంటి వంశీ(23), వెల్తూరి పవన్(22)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News