Sunday, May 12, 2024

9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి… నారాయణ పేటకు చెందిన కొండయ్య బతుకు దెరువు కోసం హైదరాబాద్ రాంనగర్ జెమినికాలనీలో నివసిస్తున్నారు. కొండయ్య కుమార్తె, సొంత గ్రామానికి రవి అనే యువకుడు ప్రేమించుకున్నారు.

వీరిద్దరి వివాహానికి రవి ఇంట్లో అంగీకరించకపోవడంతో మైనర్ బాలిక మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో శనివారం రాంనగర్ జెమినీ కాలనీ లో నివాసం ఉండే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. ఇది లా ఉండగా, రవి తనను మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసి ఉంచడంతో రవిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు. అయితే, బాధితురాలు ప్రస్తుతం ముషీరాబాద్‌లో 9వ తరగతి చదువుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News