Saturday, May 11, 2024

రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన తహసీల్దార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో శామీర్ పేట్ తహసీల్దార్ ఎసిబి వలకు చిక్కాడు. తహసీల్దార్ కార్యాలయంపై ఎసిబి దాడులు చేయడంతో ఎంఆర్ఒ సత్యనారాయణ పట్టుబడ్డాడు.  తహసీల్దార్ డ్రైవర్ భద్రి, మువ్వ రమేశ్ గిరి రావు నుంచి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. భద్రితో పాటు తహసీల్దార్ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించగా లంచం తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. తన పేరు మీద భూమి పట్టా చేయాలంటే రూ. పది లక్షలు తహసీల్దార్ డిమాండ్ చేయడంతో మువ్వ రమేశ్ ఎసిబిని ఆశ్రయించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News