Wednesday, May 8, 2024

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విహెచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎంపి వి. హనుమంతరావు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట లోని సీజన్ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్‌యుఐ స్టేట్ చీఫ్, ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా విహెచ్ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని బల్మూరి వెంకట్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News