Thursday, June 19, 2025

జీపును ఢీకొట్టిన ట్రక్కు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుఘర్ ఛప్రా ప్రాంతంలో ట్రక్కును జీపు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నలుగురిని వారణాసికి తరలించారు. దొక్టి ప్రాంతంలో ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మసూమ్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News