Thursday, May 9, 2024

ఇద్దరి ప్రాణం తీసిన చేపల వేట

- Advertisement -
- Advertisement -

చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మక్తగూడలో బుధవారం చోటుచేసుకుంది. మంగళవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాల కోల్పోయారు. మృతులను కిష్టయ్య, వెంకటేష్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News