Thursday, May 9, 2024

సిఎంతో ముగిసిన కేకే భేటీ.. కడియం ఇంటికి కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లోకి వలసల జోరు పెరిగింది. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె. కేశవరావు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలో పార్టీలో చేరతానని కేకే చెప్పినట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కేక కుమార్తె, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కూడా తండ్రితోపాటే కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

ఇదిలాఉండగా బిఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ బయల్దేరారు. ఆమెతోపాటు మరో ముగ్గురు ఏఐసిసి నేతలు కూడా ఉన్నారు. వరంగల్ నుంచి బిఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసేందుకు కడియం కావ్య విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో, తండ్రీకూతుళ్లయిన కడియం శ్రీహరి, కావ్యలను పార్టీలోకి ఆహ్వానించేందుకు దీపాదాస్ మున్షీ వారితో భేటీ కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News