Friday, May 17, 2024

వాహనం ఢీకొని చిరుత మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని కోమిరెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎండాకాలం కావడంతో చిరుతలు నీళ్ల కోసం అడవుల నుంచి గ్రామాల వైపుకు వస్తున్నాయి. చిరుత రోడ్డు దాటే క్రమంలో వాహనం ఢీకొనడంతో రోడ్డు పక్కన పడిపోయింది. వాహనదారులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News