Wednesday, June 11, 2025

ఆర్ టిసి బస్సును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్ఠారం గ్రామ శివారులో ఆర్ టిసి బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ఖమ్మం డిపోకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రోడ్డు ప్రమాదం జరగడంతో రోడ్డు పైన వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News