Monday, June 30, 2025

ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన ఆమ్రపాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కూకట్ పల్లి, జెఎన్ టియు, మూసాపేట్, భరత్ నగర్ లో రైతు బజార్ ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై చెత్త తొలగించకపోవడంతో అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News