Tuesday, September 16, 2025

సికింద్రాబాద్‌లో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

ఇంట్లో చోరీ చేసి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు దొంగిలించిన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బన్సీలాల్ పేట్ డివిజన్, భోలక్పూర్, కృష్ణానగర్ కాలనీ, భవాని శ్రీ షీలా ఎవెన్యూ అపార్ట్మెంట్ మూడవ అంతస్తులో ప్లాట్ నంబర్ 303 లో హెచ్‌డిఎఫ్‌సి ఉద్యోగి శ్రీనివాస్ కుటుంబంతో పాటు ఉంటున్నాడు. ఉదయం శ్రీనివాస్ ఉద్యోగం కోసం బ్యాంక్‌కు వెళ్లగా, అతడి భార్య తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని చూసేందుకు పుట్టింటికి వెళ్లింది.

శ్రీనివాస్ కూతురు కాలేజీకి వెళ్లింది. కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే యువతి లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే యువతి డయల్ 100కి ఫోన్ చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News