Thursday, August 21, 2025

ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

ముంబై లోని బెంబూర్ ప్రాంతం లోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించే లోపే వారు మృతి చెందారని అధికారులు తెలిపారు. షార్ట్ సర్కూటే ప్రమాదానికి కారణమని తెలిసింది. మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు ప్రారంభమై క్రమంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయని , ఆసమయంలో బాధితులంతా గాఢ నిద్రలో ఉన్నారని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంపై పోలీస్‌లు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News