Tuesday, June 17, 2025

నలుగురిని బలిగొన్న పొగమంచు

- Advertisement -
- Advertisement -

మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లా సాగర్‌ఛత్తార్‌పూర్ రహదారిపై ఉదయాన్నే దట్టంగా కమ్మేసిన పొగమంచు నలుగురిని బలిగొంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో హీరాపూర్ గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విధుల కోసం కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌ల దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News