Thursday, August 21, 2025

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఊసురు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందు గుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News