మన తెలంగాణ/హైదరాబాద్: మిస్ వరల్డ్ -2025 పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇం దులో పాల్గొనే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కం ట్రోల్ సెంటర్లో మిస్ వరల్డ్ -2025 ఏర్పాట్లపై మం గళవారం అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సమీ క్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారు లు, తదితరులు హాజరయ్యారు. ఈ సమీక్షలో భాగంగా వచ్చేనెల 10వ తేదీన ప్రారంభం కాను న్న మిస్ వరల్డ్-2025 అందాల పోటీకి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఎయి ర్ పోర్టు, అతిథులు బస చేసే హోటళ్లు, కా ర్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏ ర్పా టు చేయాలని, తెలంగాణలో చారిత్రక కట్టడా లు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేం దు కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. విభాగా లవారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు. నగరంలో పెండింగ్లో ఉన్న సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. ఈ పోటీలు పూర్తయ్యే వర కు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధిం చి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.