Saturday, May 17, 2025

గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్న బియ్యం పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సమావేశం జరిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి ఛైర్మన్, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ ఏడాదిలో బడ్జెట్ లో రూ.23 వేల కోట్లు కేటాయించామన్నారు. ఏదో విధంగా ఎస్ఎల్ బిసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణకు చేసిన అన్యాయం స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కూలిపోయే కాళేశ్వరంపై రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలియజేశారు. ఎస్ఎల్ బిసి, దేవాదుల, ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులను, నెట్టెంపాడు, భీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉచిత సన్న బియ్యంపై రూ. 13 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News