Monday, May 5, 2025

భూ భారతి విస్తరణ

- Advertisement -
- Advertisement -

రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నేటి నుంచి 28 మండలాల్లో అమలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికిన భూ భారతి చట్టాన్ని దశ ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చే యనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించా రు. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయ న వెల్లడించారు. ప్రజా కోణంలో తీసుకు వచ్చిన ఈ భూ భారతి చట్టంపై విస్తృత స్థా యిలో అవగాహన కల్పించడంతో పాటు ఆయా మండలాల్లో భూ సమస్యలపై ప్ర జల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటి ని పరిష్కరించడమే ఈ రెవెన్యూ సదస్సు ల ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

ప్రతి కలెక్టర్ రెవెన్యూ సదస్సులకు హాజరై అక్కడ రైతు లు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమయ్యే భాషలోవివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యే యంగా ఎంతో అధ్యయనంతో తీసుకువచ్చిన భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకువెళ్లాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. ఒ క కుట్రపూరితంగా, దురుద్ధేశ్యంతో తీసుకువచ్చిన ధరణితో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ధరణితో ప్రజల జీవితాలను ఆగమాగం చేసిందని తెలిపారు. ఎన్నో రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, గత ప్రభుత్వ పెద్దలే ధరణి దందాలకు అండదండలుగా నిలిచారన్నారు.

ప్ర జల ఆలోచనలకు భిన్నంగా గత పదేళ్లలో రా ష్ట్రంలో భూ హక్కుల విధ్వంసం జరిగిందని, రై తులకు రెవెన్యూ సేవలు దుర్భరంగా మారాయ ని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూ చనలు, ఆలోచనలకు అనుగుణంగా రైతు కళ్లల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని, చట్టాన్ని తీసుకురావడం ఒక ఎత్తు కాగా దానిని అమలు చేయడం మరో ఎత్తన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో విజయవంతంగా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో భూ సమస్యపై కోర్టుకు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండేది కాదని, ఇందిరమ్మ ప్రభుత్వంలో అధికార యంత్రాంగం రైతుల దగ్గరకు వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

ఆదిలాబాద్-లోని భరోజ్, భద్రాద్రి కొత్తగూడెంలోని- సుజాతనగర్, హనుమకొండలోని- నడికుడ, జగిత్యాలలోని బుగ్గారం, జనగాం లోని- ఘన్‌పూర్, జయశంకర్ భూపాలపల్లిలోని- రేగొండ, జోగులాంబ గద్వాల్‌లోని- ఇటిక్యాల్, కరీంనగర్‌లోని- సైదాపూర్, కొమరంభీం ఆసిఫాబాద్‌లోని- పెంచికల్‌పేట్, మహబూబాబాద్ -లోని దంతాలపల్లె, మహబూబ్ నగర్‌లోని- మూసాపేట్, మంచిర్యాలలోని- భీమారం, మెదక్ లోని చిల్పిచిడ్, మేడ్చల్ మల్కాజిగిరిలోని- కీసర, నాగర్‌కర్నూల్ -లోని పెంట్లవల్లి, నల్గొండ – లోని నకిరేకల్, నిర్మల్ -లోని కుంతాల, నిజామాబాద్‌లోని- మెండోరా, పెద్దపల్లి -లోని ఎలిగేడ్, రాజన్న సిరిసిల్లలోని- రుద్రంగి, రంగారెడ్డి -లోని కుందుర్గ్ సంగారెడ్డి -లోని కొండాపూర్, సిద్దిపేట లోని అక్కన్నపేట, సూర్యాపేట -లోని గరిడేపల్లె, వికారాబాద్ -లోని ధరూర్, వనపర్తి -లోని గోపాలపేట, వరంగల్ లోని వర్దన్నపేట్, యాదాద్రి భువనగిరి -లోని ఆత్మకూర్‌లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News