Tuesday, May 6, 2025

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రీజనల్ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్లకు సహకరించాలని విజ్ఞప్తి
మన తెలంగాణ / హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాల అంశాలపై గడ్కరీతో సిఎం చర్చించారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలుపాలని సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు.

ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్,- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని, హైదరాబాద్ –అమరావతి గ్రీన్ ఫీల్ ఎక్స్ ప్రెస్ వే ను వీలైనంత త్వరగామంజూరు చేయాలయని విజ్ఞప్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్- -డిండి- మన్ననూర్, హైదరాబాద్- –మంచిర్యాల గ్రీన్ ఫీల్ హైవే, ఓఆర్‌ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. సిఎం వెంట కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీలో పాల్గొన్న వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు మల్లు రవి, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

ఖమ్మం నుంచి నాగపూర్ హైవే కలపండి

ఖమ్మం టూ కురవి నుంచి అమరావతి టూ నాగపూర్ జాతీయ రహదారి వరకు రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో కేంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో ధంసలాపురం నుంచి కలెక్టరేట్ వరకు ఇరు వైపులా సర్వీస్ రోడ్స్ మంజూరు చేయాలని, జగ్గయ్యపేట టూ కొత్తగూడెం వయా వైరా నూతన జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News