- Advertisement -
దుబాయ్: మనీలాండరింగ్ కేసులో దుబాయ్లో నివసిస్తున్న భారతీయ బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నికి అక్కడి కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. షెల్ కంపెనీల నెట్వర్క్ ద్వారా మిలియన్ దిర్హామ్లను లాండరింగ్, అనుమానస్పద లావాదేవీలకు పాల్పడినందకు బల్వీందర్కు ఈ శిక్షపడింది. అంతేకాక.. ఈ ప్రముఖ వ్యాపారవేత్తకు 5లక్షల AED (రూ.1.14 కోట్లు)తో పాటు 150 మిలియన్ AED(రూ.344 కోట్లు) జరిమానా విధించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తర్వాత దేశం వదిలి పోవాలని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.
- Advertisement -