Saturday, May 10, 2025

ఎప్‌సెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ఉ.11 గంటలకు విడుదల చేయనున్న
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇం జనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన (TG EAPCET) టిజి ఎప్‌సెట్ 20 25 ఫలితాల విడుదల ముహూర్తం ఖరారైం ది. ఆదివారం(మే 11) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఎప్‌సెట్ ఫ లితాలను విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్ లో విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మా ర్కుల జాబితాను సిఎం విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు.

ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను డౌన్‌లోడ్‌కు(TG EAPCET ) అందుబాటులోకి ఉంచారు. ప్రాథమిక కీ లపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది కీ ఖరారు చేయనున్నారు. ఆదివారం తుది కీ తో పాటు ఫలితాలు ప్రకటించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఎప్‌సెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలకు 2,07,190 మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News