- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు(Temperature) కూడా సాధారణం కంటే రెండు లేదా మూడు డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు(Rains) పడతాయని సూచించింది. రానున్న రెండు రోజులు కూడా గంటకు 40 కి.మీ. నుంచి 50 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
- Advertisement -