Friday, June 6, 2025

ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌: శతక్కొట్టిన మంధాన .. శ్రీలంకకు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

కొలంబో: మహిళల వన్డే ట్రై సిరీస్‌ ఫైనల్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన (116) శతకంతో చెలరేగింది. హర్లీన్‌ డియోల్ (47), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జేమీమా రోడ్రిగ్స్ (44), ప్రతీకా రావల్(30)లు రాణించారు. దీంతో భారత్, శ్రీలంక జట్టుకు 343 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

శ్రీలంక బౌలర్లలో దేవ్మీ విహంగా, మదార, సుగందికా కుమారిలు తలో వికెట్ పడగొట్టగా.. ఇనోకా రణవీర ఒక వికెట్ తీసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక.. 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో చమరి అథాపత్తు(25), హర్షిత సమరవిక్రమ(0)లు క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News