- Advertisement -
హైదరాబాద్: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులుతో రాష్ట్రంలో(Telangana) వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాత, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో గంటలకు 40-50 కిలోమీటర్ల ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
- Advertisement -