- Advertisement -
అమరావతి: యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ పై దుష్ప్రచారం చేస్తోందని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati ravi kumar) మండిపడ్డారు. మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దడానికే తమకు టైం సరిపోతుందని అన్నారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ శాఖను జగన్ దుర్వినియోగం చేశారని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచలేదు.. పెంచబోంమని చెప్పారు. పదే పదే కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు చూస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -