Tuesday, May 13, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం వెంకన్న సర్వదర్శనం తిరుమలకు మోస్తరు సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 68,760 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,544 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.09 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News