ఎసిబి కేసులో అరెస్టయిన సూర్యాపేట డిఎస్పి ఇంట్లో సోదాలు సోదాల్లో 21 లైవ్ బుల్లెట్లు లభ్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పిగా పనిచేస్తున్న కొండం పార్థ సారథి ఎసిబి కేసులో చిక్కుకున్నారు. ఈ కేసులో భాగంగా ఎసిబి అధికారులు ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో అక్రమ మందుగుండు సామగ్రి బయటపడటం సంచలనం రేపింది. ఈ కేసు పూర్వాపరాలు, సోదాల్లో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. లంచం కేసులో అరెస్టు అయిన ఒక రోజు తర్వాత తె లంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) మంగళవారం హయత్ నగర్లోని దత్తాత్రేయ నగర్లోని సూర్యాపేట డిఎస్పి కె. పార్థసారథి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 21 లైవ్ రౌం డ్లు, 69 ఖాళీ కార్ట్రిడ్జ్లు, ఒక కార్ట్రిడ్జ్ స్టాండ్ను కనుగొన్నారు. హయత్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డీఎస్పీ ఇంట్లో 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కార్ట్రిడ్జ్లు, ఒక కార్ట్రిడ్జ్ స్టాండ్ లభించాయని ఎసిబి ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీ మోహన్ వెల్లడించారు.
డిఎస్పి, సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ పి.వీర రాఘవులుపై అవినీతి నిరోధక చట్టం-1988 సెక్షన్ 7(ఎ) కింద నమోదు చేసిన ఎసిబి కేసుకు సంబంధించి ఆ ఇంటిని సోదా చేశారు. ఫి ర్యాదు ఆధారంగా, పోలీసులు ఆయుధ చట్టం -1959లోని సెక్షన్ 25 (1ఎ) (1ఎఎ) కింద కేసు నమోదు చేసి నట్లు హయత్నగర్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు గౌడ్ వెల్లడించారు. సోమవారం, ఫిర్యాదుదారుడి నుండి మొదట రూ. 25 లక్షలు లంచం డిమాండ్ చేసినందుకు పార్థసారథి వీర రాఘవులును ఎసిబి అరెస్టు చేసింది తర్వాత ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు అధికారిక అనుకూలంగా వ్యవహరిం చినందుకు ఆ మొత్తాన్ని రూ.16 లక్షలకు తగ్గించారు. సూర్యాపేట టు టౌన్ పోలీస్స్టేషన్కు చెందిన కేసులో (క్రైమ్ నంబర్: 166/ 2025) ఫిర్యాదు దారుడిని అరెస్టు చేయకుండా ఉండటానికి ఫిర్యాదుదారుడు తన స్కానింగ్ సెంటర్ను సజావుగా నడపడానికి అనుమతించడానికి లంచం డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు పోలీసు అధికారులు తమ ప్రజా విధిని సక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించారని ఎసిబి అధికారులు వెల్లడించారు.
అయితే, పార్థసారధి ఈ బుల్లెట్లను 1992 నుంచి 1997 వరకు స్పెష్టల్ పార్టీ కానిస్టేబుల్గా ఏటూరు నాగారంలో పనిచేసిన సమయంలో దాచిపెట్టుకున్నాడని, ఆ తర్వాత ఎస్ఐగా ఎంపికై పదోన్నత్తులు పొంది తాజాగా డీఎస్పీగా పని చేస్తున్నంత వరకు బుల్లెట్లను తన వద్ద ఉంచుకున్నాడని తెలిసింది. అయితే పోలీసు అధికారిగా బుల్లెట్లను తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన రికార్డును కచ్చితంగా బెల్ ఆఫ్ ఆర్మ్లో నమోదు చేయాలి. తిరిగి అప్పజెప్పే సమయంలో కూడా వాటి వివరాలను నమోదు చేయాలి. కానీ అలా చేయకుండా పార్థసారధి అక్రమంగా ఈ బుల్లెట్లను ఎందుకు పెట్టుకున్నాడనే విషయం ఎసిబి అధికారులకు అంతుచిక్కడం లేదు. అయితే ఇన్ని బుల్లెట్లను తన వద్ద పెట్టుకున్నా పోలీసు రికార్డుల్లో వాటిని ఎవరు గుర్తించలేదనే అనుమానాలు తలెత్తుతున్నా యి. ఈ రికార్డుల పరిశీలనలో కూడా సంబంధిత అధికారలు నిర్లక్ష్యం స్పస్టంగా కనపడుతుంది.
పార్థసారధి దగ్గర ఇన్ని బుల్లెట్లు ఎలా జమ అయ్యాయని తేలాల్సి ఉంది. వీటన్నింటి లెక్కలను పార్థసారధి పని చేసిన చోట ఉండే బెల్ ఆఫ్ ఆరమ్స్ రికార్డులలో నమోదు చేశాడా లేదా విషయాలను ఇప్పుడు హాయత్ నగర్ పోలీసులు తమ దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉంది. పార్థసారధిని ఎసిబి అధికారులు లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టు చేసి, రిమాండ్ పంపిన తర్వాత హాయత్ నగర్ పోలీసులు పీటీ వారెంట్పై అతనిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఈ బుల్లెట్ల వ్యవహారంపై దర్యాప్తును చేయనున్నారు. బుల్లెట్ల వ్యవహారంపై హాయత్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. మరో వైపు డిఎస్పి పార్థసారధి లంచం డిమాండ్ కేసులో సోదాలు జరిపిన ఎసిడి అధికారులకు ఆయన ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్లు దొరికాయి. వీటి బహిరంగ మార్కెట్లో కోట్లాది రూపాయాలు విలువ చేస్తుందని సమాచారం.