Tuesday, July 1, 2025

కారు సీజ్.. పోలీసు విచారణకు హాజరైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ట్రాఫిక్ పోలీసుతో దురుసుగా ప్రవర్తించడంతో నమోదైన కేసులో గురువారం సాయంత్రం హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అవసరమైనప్పుడు కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆయనకు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆయన కారును సీజ్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. కాగా,  జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్.. రెండ్రోజుల క్రితం కారులో ప్రయాణిస్తూ రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా గమనించిన ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసుతో శ్రీనివాస్‌ దురుసుగా ప్రవర్తించారు. కారు ఆపినందకు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై హీరో దుర్భాషలాడారు. దీంతో శ్రీనివాస్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

కాగా, ‘అల్లుడు శ్రీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఊహించినంత సక్సెస్ కాలేకపోయారు. త్వరలో ఆయన ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News