- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆంద్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసలో చోటుచేసుకుంది.. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోదవలస జాతీయ రహదారిపై గోర్లె సురేష్, రావాడ వెంకట్రావు అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
- Advertisement -