ఇప్పటి వరకూ మూడు రొమాంటిక్ పాటలు విడుదల చేసిన ‘షష్టిపూర్తి’ (Shashtipurthi) సినిమా బృందం, ఇప్పుడు టైటిల్ జస్టిఫికేషన్ చేస్తూ ‘షష్టిపూర్తి’ నేపథ్యంలో పాటను విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేసి, యూనిట్కి బెస్ట్ విషెస్ తెలిపారు. డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించిన ‘షష్టిపూర్తి’ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఆదివారం విడుదల చేసిన ‘షష్టిపూర్తి’ నేపథ్యంలో వచ్చే గీతాన్ని చైతన్య ప్రసాద్ రచించగా, కార్తీక్, విభావరి ఆప్టే జోషి పాడారు. స్వర్ణ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు.
ఈ పాట గురించి దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. “వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన! ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన! సరాదలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవైలో ఇరవైలా విరిసిన వరమాల..” అంటూ సాగే ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్ అద్భుతంగా రాశారు. ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్న ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజా స్వరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది? ఈ పాట రికార్డింగ్ని ప్రత్యక్షంగా వీక్షించి పులకించి పోయాను. రాజేంద్ర ప్రసాద్, అర్చన, మా హీరో హీరోయిన్లు రూపేష్, ఆకాంక్ష సింగ్లు ఈ పాటలో నిజంగా జీవించారు. చాలా కాలం గుర్తుండి పోయే పాట ఇది’ అని తెలిపారు.