Tuesday, May 20, 2025

నల్లమలకు గిరి సౌరభం

- Advertisement -
- Advertisement -

వచ్చే ఐదేళ్లలో సౌరవిద్యుత్‌తో
సాగునీటి సౌకర్యం 2.10లక్షల
మంది గిరిజన రైతులకు లబ్ధి
100శాతం సబ్సిడీతో
సాగుయోగ్యంగా మార్చడమే లక్షం
గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు
నల్లమల డిక్లరేషన్‌లో ప్రధానాంశాలు
నాగర్‌కర్నూల్ పర్యటనలో
ఇందిర సౌర గిరి జల వికాసం
ప్రారంభోత్సవం సందర్భంగా
ఆవిష్కరించిన సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి సోమవారం నల్లమల పర్యటన సందర్భంగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంపై నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని 2 లక్షల 30వేల 735 మంది షెడ్యుల్డ్ ట్రైబ్స్‌కు 6.69 ల క్షల ఎకరాల భూములను ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం 2006 కింద గిరిజనుల అభివృద్ధికి ఈ నల్లమల్ల డిక్లరేషన్ ఉపయోగపడనుంది. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తూ వారు సాగు చేసుకుంటున్న స్థానంలోనే ఇందిరా సౌర గిరి జల వి కాసం కింద వంద శాతం సబ్సిడిపై గిరిజన రైతులకు ఈ పథకం కింద భూముల రెగ్యులరైజేషన్ సోలార్ పంప్ సెట్లు, బోరు బావుల త వ్వకం, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లను అందించనున్నారు. అందులోనే ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టనున్నా రు. పది అంశాలతో కూడిన డిక్లరేషన్‌ను సోమవారం బహిరంగ సభలో ప్రకటించారు.

2.10 లక్షల మంది ఎస్టి రైతులకు గాను 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడానికి 12వేల 600 కో ట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించనుం ది. 202526 సంవత్సరంలో పది వేల మంది రైతులకు 27 వేల 184 ఎకరాలకు గాను 600 కోట్లను ఖర్చు చేయనుంది. ఇదే విధానం ద్వా రా ప్రతి ఏడాది  లబ్ధిదారులను పెంచుతూ 2029-30 నాటికి ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి గిరిజనుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా గిరిజనులకు ఇందిరమ్మ హౌసింగ్ స్కీం ద్వారా ఈ పథకంలో లబ్ధి పొందే రైతులకు ఇళ్లను కేటాయించనున్నారు. అదే విధంగా వారికి ఆర్థిక చేయూత అందించే విధంగా ఒక లక్ష ఎస్టిల నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వెయ్యి కోట్ల రూపాయలను స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద వినియోగించనున్నారు. మొత్తం 10అంశాలతో కూడిన డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News