Wednesday, May 21, 2025

రాష్ట్రంలో త్వరలో స్కిల్ సర్వే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ—/రామగిరి:వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖమాత్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం రామగుండం3 అడ్రియాల ప్రా జెక్టు ఏరియాలోని ఎంవిటిసిలో సింగరేణి సంస్థ సిఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌సెంటర్(నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేం ద్రం)ను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అ తిథిగా హాజరై ప్రారంభించారు. విశిష్ట అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామగుండం3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్రసుధాకర్‌రావు అధ్యక్షత వహించి సింగరేణి సంస్థ ద్వారా పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు వివిధ విభాగాల్లో ఉచితంగా ఇస్తున్న శిక్షణ గురించి తెలియజేశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతీయువకుల్లో వృత్తి నైపుణ్యత పెంచి, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వివిధ ఏరియాల్లో ఇలాంటి శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తుందన్నారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా సుమారు 38 కోర్సులలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వబడుతుందని, అలాంటి శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు.

శిక్షణ పొందే అభ్యర్థులు సర్టిఫికెట్ కోసమే కాకుండా పూర్తిస్థాయిలో శిక్షణ పొంది నిజమైన నైపుణ్యాన్ని సాధించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని, త్వరలో రాష్ట్రంలో స్కిల్ సర్వే నిర్వహించి నిరుద్యోగులకు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నైపుణ్యత ఆధారంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఒక కళాశాలగా అభివృద్ధి చేసి ఇక్కడి నుండే నియామకాలు చేపట్టే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ, హెచ్‌ఆర్‌డి విభాగం జనరల్ మేనేజర్ గుంజపడుగు రఘుపతి, రామగుండం1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్‌ఉమార్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్, ప్రాతినిధ్య సంఘం నాయకులు కోట రవీందర్‌రెడ్డి, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.నరసింహులు, ఆర్‌డిఓ సురేష్, ఎస్‌ఓటు జీఎం బివి సత్యనారాయణ, వివిధ గనుల, విభాగాల అధిపతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News