Tuesday, June 10, 2025

రాష్ట్రంలో కొవిడ్ కేసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి వళ్లీ వచ్చింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్లు తెలిసింది. అలాగే ఎపిలోని విశాఖ జిల్లాలో కొవిడ్ -19 కేసు నమోదైన విషయం తెలిసిందే. మద్దిలపాలెంకు చెందిన మహిళకు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 30 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఒపి భవనం రెండో అంతస్తులో వార్డు ఏర్పాటు చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి తెలిపారు.

ఆందోళనకు గురికావద్దు : వైద్యుల సూచన
కొవిడ్ కేసులు వ్యాప్తి నేపథ్యంలో ఎవరూ అనవసర ఆందోళనకు గురికావద్దని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కొవిడ్ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుని వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని తెలిపారు. కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News