మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ’గ్యాంబ్లర్స్’. (Gamblers)ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్కుమార్ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. కేఎస్కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్చేస్తున్నారు.
కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్కే చైతన్య మాట్లాడుతూ “ఇదొక మిస్టరీ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో కొత్త సంగీత్ శోభన్ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి”అని అన్నారు. నిర్మాతలు సునీత, రాజ్కుమార్ మాట్లాడుతూ కొత ్తకాన్సెప్ట్తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.