- Advertisement -
రాంఛీ: ఝార్ఖండ్లోని లతేహార్లో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్ల మృతి చెందారు. మృతుల్లో జార్ఖండ్ జన్ ముక్తీ పరిషత్ కీలక నేత పప్పు లోహరా ఉన్నారు. పప్పు లోహరాపై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఇచాబార్ అడవిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -