- Advertisement -
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ECI) వెల్లడించింది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. జూన్ 19 (గురువారం)న ఉప ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని.. జూన్ 23 (సోమవారం)న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. గుజరాత్లో రెండు.. కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసిఐ తెలిపింది.
- Advertisement -