Saturday, June 7, 2025

సంగీత్‌ శోభన్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

‘మ్యాడ్’ ఫేం సంగీత్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’. రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కెఎస్‌కె చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రశాంతి చారులింగా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

“యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. పేకాట జూదం నేపథ్యంలో ఈ మూవీ రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేం రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జూన్‌ 6న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News