స్నేహితులతో పబ్బులో పార్టీ చేసుకున్న యువకుడు తెల్లవారేసరికి మృతిచెందిన సంఘటన సైబరాబాద్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని విజయనగరం జిల్లా, ప్రసాద్నగర్కు చెందిన హర్షవర్దన్ సికింద్రాబాద్లోని ఓ ఎసి కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి ఆదివారం రాత్రి కొండాపూర్లోని క్వాక్ పబ్లో పార్టీ చేసుకున్నారు. పబ్బు నుంచి స్నేహితులతో కలిసి కొండాపూర్లోని అపార్ట్మెంట్లోని ఫ్లాట్కు వచ్చాడు.
అక్కడ మరోసారి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అయితే తెల్లవారుజామున హర్షవర్దన్కు వాంతులు చేసుకోవడంతో స్నేహితులు ఎఐజి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్షవర్దన్ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. హర్షవర్దన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.