Monday, June 9, 2025

బర్లు,గొర్లు కాదు.. విద్యకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

బడుగులను కులవృత్తులకే పరిమితం
చేయాలనుకున్న గత పాలకులు
తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని
ఆశించిన యువత ఆశలపై నీళ్లు చల్లిన
బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా
ప్రభుత్వం వచ్చాక 15నెలల్లోనే 59వేల
ఉద్యోగాలు భర్తీ చేశాం రాజ్యాంగం
ప్రకారమే రిజర్వేషన్లు ఎస్‌సి, ఎస్‌టిలను
పాలకులుగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే
ఉద్యోగ నియామకాలపై కుట్రలు
జరుగుతున్నాయి ఎస్‌సి గురుకుల
విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లను అమలు చే స్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో బుధవారం జరిగిన గురుకుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆ యన మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలను పాలకులుగా తీర్చిదిద్దిన ఘనత కాం గ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించాం, అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వం లో ఎంపిక చేసుకున్నాం, వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రా లేదు, చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చింది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అన్ని రంగాల్లోనూ రాణించాలి అని ముఖ్యమంత్రి విద్యార్థులనుద్దేశించి అన్నారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ‘చాలామం ది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు, చదువు మాత్రమే. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది‘ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సమాజంలో నెలకొన్న రుగ్మతలు, అసమానతలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నా రు. తెలంగాణ వైతాళికుడుసు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును తెలుగు యూనివర్సిటీకి, కోఠిలోని మహిళా విద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, ఇనిస్టిట్యూట్ ఆప్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టి గౌరవించుకున్నామని గుర్తుచేశారు. ఎందరో త్యాగమూర్తుల స్పూర్తితోనే సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని సిఎం అన్నారు.కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, అన్ని వర్గాల పిల్లలు ఒకేచోట చదువుకునేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే, వారు చదువుకునే పరిసరాలు, మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమని సిఎం వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది
ఎస్‌సి, ఎస్‌టి, బిసి పిల్లలకు చదువులు వద్దని, వారు కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని, దళితులు, బిసిలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సిఎం వ్యవహరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువత ఆశలపై గత ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. ‘మాజీ ముఖ్యమంత్రి తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కాని రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంకా లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నది
ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. ఆరు నెలలు కూడా విరామం లేకుండా వారు (బిఆర్‌ఎస్ నాయకులు) ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారు‘ అని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేస్తున్నాం : భట్టి
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎస్‌సి సబ్‌ప్లాన్ క్రింద తమ ప్రభుత్వం చాలా ఖర్చు చేసిందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నిధులను గాలికి వదిలేసిందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి మనస్ను నాయకుడని, ప్రజల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటీల కోసం 104 స్కూళ్లను కొత్తగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం గిరిజనులకు దక్కిన 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ఇందిర సౌర గిరి జలవికాసం అనే పథకాన్ని తెచ్చిందని, ఈ పథకం కింద గిరిజన రైతులకు ఉచితంగా పంపుసెట్లు, సోలార్ ప్యానల్స్, డ్రిప్, స్పింకర్లు, ఉద్యాన శాఖ ద్వారా ఆవకాడో,

వెదురు వంటి పంటలను గిరిజన రైతుల ద్వారా సాగు చేయిస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 12,500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గురుకులాల్లో పదోతరగతి, ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కరనబరిచిన విద్యార్థులకు సిఎం చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా సిఎం రేవంత్ రెడ్డి కార్యక్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గురుకుల విద్యాలయాల కార్యదర్శి అలుగు వర్షిణితో పాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News