Wednesday, June 4, 2025

ప్రతి హామీ నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాం: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వం నకిలీ మద్యంతో వేల కోట్లు లూటీ చేశారని ఎపి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కడపలో మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ..గతంలో ‘జె’ బ్రాండ్ మద్యంతో 30 వేల మందిని చంపేశారని విమర్శించారు. అందరం జెండా, ఎజెండా పక్కన పెట్టి పనిచేశామని, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రానున్న జూన్ లో డిఎస్సి నిర్వహిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి టీచర్ల నియామకం అమలవుతుందని తెలియజేశారు. వైనాట్ 175 అన్నవారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఎద్దేవా చేశారు. సిబిఎన్ అంటే.. అభివృద్ధి, సంక్షేమం, మనందరి ధైర్యం, సిబిఎన్ అంటే.. పేదల చిరునవ్వు అని పేర్కొన్నారు. గతంలో ప్రశ్నిస్తే కేసులని పోరాడితే అరెస్టులని మండిపడ్డారు. తన పైన 23 కేసులు పెట్టారని..అయినా తగ్గేదే లేదని లోకేష్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News