Monday, June 9, 2025

హిందూకుష్‌లో కరిగిపోతున్న హిమానీనదాలు

- Advertisement -
- Advertisement -

భూతాపం మరో 2 డిగ్రీలు పెరిగితే ఈ శతాబ్దం అంతానికి హిందూకుష్ హిమాలయ పర్వత శ్రేణిలో హిమానీ నదాల మంచు 75 శాతం వరకు కోల్పోవచ్చని నూతన అధ్యయనం వెల్లడించింది. హిమానీ నదాలు కరిగిపోవడంపై ఏర్పడే ప్రభావాలపై తజికిస్థాన్ లోని దుషాంబేలో శుక్రవారం అంతర్జాతీయ సమావేశం ప్రారంభమైంది. ఐక్యరాజ్యసమితి విద్య,శాస్త్రీయ, సాంస్కృతిక, సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ, ఆసియా అభివృద్థి బ్యాంకు సమన్వయంతో ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా అధ్యయనంపై చర్చించారు. ప్రపంచ దేశాలు పారిశ్రామిక యుగం కన్నా పూర్వపు స్థితికి 1.5 డిగ్రీల వరకు భూతాపాన్ని అదుపు చేయగలిగితే హిమాలయాల్లోను, కాకసస్ లోను 40 నుంచి 45 శాతం వరకు హిమానీనదాల మంచును కాపాడుకోవచ్చని అధ్యయనం సూచించింది. ఈ శతాబ్దం అంతానికి భూతాపం 2.7డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగితే నాలుగోవంతు హిమానీ నదాల మంచు కోల్పోవనడమౌతుందని పేర్కొంది. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు అదుపు చేయగలిగితే అన్ని రీజియన్లలో

కొంతవరకు హిమానీ నదాల మంచు నిలిచి ఉంటుందని ఈ అధ్యయనం ప్రధానంగా సూచించింది. ఈమేరకు అనుకున్న లక్షం సాధిస్తే ప్రస్తుత హిమానీనదాల మంచులో 50 శాతం మిగిలి ఉంటుందని, అలాగే నాలుగు సున్నిత ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతం వరకు మంచు స్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ సదస్సులో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ యింగ్‌మింగ్ మాట్లాడుతూ హిమానీనదాల మంచు కరిగిపోవడం జీవితాలకు ప్రమాద సూచిక అని, ఆసియా లోని 2 బిలియన్ కన్నా ఎక్కువ మంది ఈ హిమానీనదాల ఆధారంగా జీవిస్తున్నారని వెల్లడించారు. కర్బన ఉద్గారాలను నిరోధిస్తే హిమానీ నదాలు కరిగిపోవడం మందగిస్తుందన్నారు. ప్రపంచం మొత్తం మీద 2, 00,000హిమానీ నదాల మంచు కరిగిపోవడాన్ని గణించడానికి 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఎనిమిది హిమానీనదాల నమూనాలను ఉపయోగించారని చెప్పారు. ఈ దృశ్యాలన్నిటిలో హిమానీనదాలు కొన్ని దశాబ్దాలుగా మంచును విపరీతంగా వేగంగా కోల్పోయినట్టు బయటపడిందని , ఇది కొన్ని శతాబ్దాలపాటు కొనసాగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News