బకార్డి మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ప్రీమియం విస్కీ అయిన లెగసి, ప్రతిష్టాత్మక వరల్డ్ విస్కీస్ అవార్డ్స్ 2025లో బ్లెండెడ్ విస్కీ విభాగంలో గోల్డ్ని అందుకుంది. ఈ గుర్తింపుతో, ప్రపంచ గుర్తింపును పొందిన భారతదేశం యొక్క సరికొత్త ప్రీమియం వ్యక్తీకరణగా లెగసి మారింది. సొగసైన, సమకాలీనమైన , నైపుణ్యంతో రూపొందించబడిన లెగసి కేవలం ఒక కొత్త విస్కీ కాదు- ఇది ఆధునిక భారతీయ అధునాతనత మరియు ప్రపంచ ఆకాంక్షను ప్రతిబింబించే జీవనశైలి ప్రకటన. దేశంలో రాజీలేని నాణ్యతతో రూపొందించబడిన లెగసి, భారతీయ, స్కాటిష్ మాల్ట్ల యొక్క విలక్షణమైన మిశ్రమం. ఈ అవార్డులు లెగసిని ప్రపంచ పటంలో ఉంచడమే కాకుండా, ప్రీమియం విస్కీ తయారీ ప్రపంచంలో బకార్డి యొక్క ప్రభావాన్ని కూడా నొక్కి చెబుతున్నాయి.
మూడు సంవత్సరాల కిందట విడుదల చేయబడిన లెగసి, ప్రీమియం విస్కీ విభాగంలో ముందంజలో వుంది. ప్రపంచ విస్కీ అవార్డులు స్పిరిట్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. ఈ ప్లాట్ఫామ్లో గోల్డ్ అవార్డు అనేది శ్రేష్ఠతకు నిజమైన నిదర్శనం. ఈ విజయం ది డ్రింక్స్ బిజినెస్ ఆసియా నిర్వహించిన ఆసియా స్పిరిట్స్ మాస్టర్స్ 2025లో రజతం ద్వారా సమున్నతం చేయబడింది.
“వరల్డ్ విస్కీస్ అవార్డ్స్ 2025లో లెగసి బంగారు పతకం, ఆసియా స్పిరిట్స్ మాస్టర్స్ 2025లో రజతం గెలుచుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. ఈ గుర్తింపు భారతీయ వారసత్వంలో ధైర్యంగా, విలక్షణంగా మరియు లోతుగా పాతుకుపోయిన ప్రపంచ స్థాయి స్పిరిట్లను రూపొందించడంలో మా నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ” అని అన్నారు. లెగసి ఇప్పుడు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి మరియు గోవా వంటి కీలక మార్కెట్లలో 3 పరిమాణాలలో (750ml, 375ml, 180ml) అందుబాటులో ఉంది.