మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా స్కై. (Sky) ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న స్కై సినిమా నుంచి ‘జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై(Journey of Emotional Sky) టీజర్’ లాంచ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ “నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా.
ఈ సినిమాలో ప్రతిభ గల టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే స్కై మూవీతో మీ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు. డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ “-డైరెక్టర్గా నాకు ఇది డెబ్యూ మూవీ. ఇటీవల ‘స్కై‘ మూవీ షో చూసి మూవీ చాలా బాగుందని అంతా చెప్పారు. ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, హీరోయిన్ శృతి శెట్టి తదితరులు పాల్గొన్నారు.