- Advertisement -
హైదరాబాద్: బిజెపి ఎంపి ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) విమర్శల వర్షం కురిపించారు. ఈటెల బిఆర్ఎస్ను వీడిన అంటూనే 24 గంటలు ఆ పార్టీ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈటెల బిజెపిలో ఉన్నారనే విషయం ఆ పార్టీ నేతలు కూడా గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మోస్ట్ కన్య్పూజ్ పోలిటీషియన్ ఈటెల అని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్లోకి ఈటెల వెళ్లారని.. కానీ ఏ పదవి రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే ఈరోజు ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నాం అని తెలిపారు.
- Advertisement -