Friday, June 6, 2025

అన్నా వర్శిటీ విద్యార్థినికి న్యాయం

- Advertisement -
- Advertisement -

అత్యాచార దోషికి జీవిత ఖైదు
మహిళా న్యాయమూర్తి తీర్పు
31 ఏండ్లు కటకటాల పాలు
రిమిజన్ లేదు…90వేల జరిమానా
స్వాగతించిన సిఎం స్టాలిన్
మిగిలిన దోషులపై అన్నాడిఎంకె ప్రశ్నలు
డిఎంకె సంగతి తేలుస్తామన్న పళని

చెన్నై : గత ఏడాది డిసెంబర్‌లో తమిళనాడులో అన్నా యూనివర్శిటీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ జ్ఞానశేఖరన్‌కు 30 సంవత్సరాల కఠిన, కనీస జీవిత ఖైదు పడింది. ఈ వ్యక్తికి ఎటువంటి రిమిషన్ ఉండదు. జీవిత ఖైదుతో పాటు ఈ దోషికి రూ 90,000 జరిమానా విధించారు. ఇది కట్టకపోతే శిక్షకాలం పెరుగుతుంది. పలు సాక్షాధారాలు ఇతరత్రా విషయాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక మహిళా కోర్టు ఈ ఉదంతంలో జ్ఞానశేఖరన్ పాత్రను నిర్థారించి ఇటీవలే దోషిగా ఖరారు చేసింది. ఇప్పుడు శిక్షాకాలాన్ని మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం రాజ్యలక్ష్మి వెలువరించారు.

ఓ ఆడపిల్ల, భవితపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థినిని తన లైంగిక చేష్టకు దిగిన మానవమృగం ఆమె బతుకును నాశనం చేసినట్లు ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి. ఇది అత్యంత అమానుష ఘటన, మటన్ అమ్ముకుని బతికే వ్యక్తి ఆమె ఓ స్నేహితుడితో పాటు ఉన్నప్పుడు బెదిరించి తీసుకువెళ్లి తన కామదాహం తీర్చుకున్నాడు. అన్ని న్యాయ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ దోషికి భారతీయ న్యాయ సంహిత చట్టం )బిఎన్‌ఎస్)లోని 64(1) సెక్షన్ పరిధిలో శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ కీలక తీర్పు పట్ల తమిళనాడు అంతటా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పందిస్తూ దోషికి అత్యంత గరిష్ట శిక్ష పడిందని, ఇది అన్ని విధాలుగా సరైనది అని తెలిపారు.

ఈ దోషికి ఏ పరిస్థితుల్లోనూ ప్రకటిత శిక్షలో తగ్గింపు కానీ, జరిమానా మాపీకానీ ఉండబోదని న్యాయమూర్తిణి స్పష్టం చేశారు. నిర్థారిత దోషిపై 11 రకాల అభియోగాలు దాఖలు అయ్యాయి. ప్రాసిక్యూషన్ వీటిని సమర్థవంతంగా నిరూపించింది. వేర్వేరు అభియోగాలపై పడ్డ శిక్షలను దోషి ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. దోషి శిక్షల తీవ్రతలను వేర్వేరు స్థాయిల్లో భరించాల్సి ఉంటుంది. దోషికి అర్హమైన శిక్ష పడిందని , కేసు తప్పుదోవ పట్టించే యత్నాలు ఫలించలేదని న్యాయం గెలిచిందని అన్నాడిఎంకె నాయకులు పళనిస్వామి స్పందించారు. ఈ ఉదంతంలో పాలుపంచుకున్న ఇతరులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయపరంగా శిక్షిస్తుందని వ్యాఖ్యానించారు.

బిజెపి ఇతర పార్టీల నేతలు కూడా ఈ తీర్పును స్వాగతించారు. ఇక ఈ దోషికి శిక్ష పడిన నేపథ్యంలోనే రాష్ట్రంలోని డిఎంకె, అన్నాడిఎంకె మధ్య రాజకీయ వివాదం మరింత భగ్గుమంది. స్టాలిన్ ఈ కేసులో మరికొందరు వ్యక్తులను రక్షించారని , ఈ విషయాలను తాము వెలుగులోకి తీసుకువస్తామని అన్నాడిఎంకె తెలిపింది. డిఎంకెకు జ్ఞానశేఖర్ నమ్మిన బంటు, స్టాలిన్ అంటే విధేయత అని, అందుకే కేసును తప్పుదోవ పట్టించేందుకు అధికార యంత్రాంగం ద్వారా చాలా వరకూ యత్నించారని పళనిస్వామి ఇతరులు విమర్శించారు. ఈ వాదనలను అధికార డిఎంకె తిప్పికొట్టింది. ఓ మహిళ పట్ల దారుణం జరిగింది. ఇప్పుడు తీర్పుతో న్యాయం దక్కింది. దీనిని కూడా ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని స్టాలిన్ సన్నిహితులు ఎదురుదాడికి దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News